సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రా ష్ట్రంలో సాహిత్య, సంగీత, సాంస్కృతిక పోటీలను సంయక్తంగా నిర్వహిం చ నున్నట్టు సాహిత్య అకాడమీ, సంగీ త నాటక అకాడమీ శుక్రవారం ప్రకటించాయి. 7,8,9 తరగతుల విద్యార్థులకు మాత్రమే పోటీల్లో పాల్గొనే అవకాశా న్ని కల్పించారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో పద్య కవితలు, వచన కవితలు, కథలు, వ్యాసాల పోటీలు నిర్వ హించనున్నారు.
సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో సంగీతం, నృత్య ప్ర దర్శన, ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహించనున్నారు. విద్యార్థులు రాసి న రచనలను నవంబర్ 5న సాహిత్య అకాడమీ కార్యాలయానికి అందేలా పంపాలని సూచించారు. సాంస్కృతిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లను 9440966107 నంబర్కు కాల్ చేసి నవంబర్ 5లోపు నమోదు చేసుకోవాలని సూచించా రు.