26-01-2025 04:25:17 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గణతంత్ర దినోత్సవం రోజున మద్యం, మాంసం విక్రయాలు ప్రభుత్వం నిషేధించిన గ్రామాల్లో మద్యం, మాంస విక్రయాలు నిర్వహించడంతో పోలీసులు రెవెన్యూ మున్సిపల్ శాఖ అధికారులు పలు దుకాణాలను తనిఖీ చేసి నమోదు చేసినట్టు తెలిపారు. నిర్మల్ పట్టణంలోని పాత బస్టాండ్ ఇంద్ర నగర్ మంజులాపూర్ తదితర ప్రాంతాల్లో మాంసం విక్రయాలు నిర్వహించగా సోను మండలం మాదాపూర్ లో మద్యం విక్రయాలు బెల్ట్ షాపుల్లో నిర్వహించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో వాటిపై చర్య తీసుకున్నారు .