28-04-2025 02:18:10 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో నిలువ నీడలేని దేవరకొండ లక్ష్మీనారాయణ అనే నిరుపేద ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబానికి కేసముద్రం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 15 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు లక్కాకుల సత్యనారాయణ, ఎర్నం శ్రీరాములు, నాగేశ్వర చారి, కొత్త జగన్మోహన్రెడ్డి, చింత కర్ణాకర్, మడిపెద్ది వెంకటేష్, రాపాక కుమారస్వామి, బొప్పిడి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.