calender_icon.png 1 February, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన లింగంపేట ఎస్సై సుధాకర్

29-01-2025 05:49:13 PM

కామారెడ్డి (విజయక్రాంతి): వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్సై సుధాకర్​ ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యాపారి వద్ద నుంచి రూ.12,500 తీసుకుంటూ పట్టుబడ్డాడు. బుధవారం నిజామాబాద్​ నగరంలోని వినాయక్ నగర్​లో డబ్బులు తీసుకుంటూ రెండ్​హ్యాండెడ్​గా దొరికాడు. కాగా.. ఎస్సై సుధాకర్​ లీవ్​పై నిజామాబాద్​కు వచ్చినట్లు సమాచారం. గత రెండు నెలల కిత్రం ఇదే స్టేషన్​లో పనిచేసిన ఎస్సై అరుణ్​ కుమార్​ ఓ కేసు విషయంలో రూ. 20వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం తెలిసిందే.