హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): గవర్నర్ జిష్ణు దేవ్వర్మను తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశం గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యామండలి పనితీరును గవర్నర్కు వివరించారు. విద్యాసంస్థలు, రాష్ట్రంలోని గ్రాస్ ఎన్రోల్మెంట్పై చర్చించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యామండలి పనితీరుపై అధికారులను గవర్నర్ అభినందించినట్టు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యశాఖ ముఖ్యకార్యదర్శి, గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.