calender_icon.png 28 April, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిడుగు పడి విరిగిన విద్యుత్ స్తంభం

26-04-2025 12:00:00 AM

మహిళకు అస్వస్థత

నాగల్ గిద్ద, ఏప్రిల్ 25 : నాగల్ గిద్ద మండలంలోని కరస్ గుత్తి రేఖనాయక్ తండ గ్రామపంచాయతీలో సాయంత్రం వడగళ్ల వర్షం కురవడంతో పిడుగు కరెంట్ స్తంభంపై పడి స్తంభం విరిగిపోవడంతో పక్కనే ఉన్న రాందాస్ ఇంట్లో విద్యుత్ వ్యాపించి మరుణ బాయ్ అనే మహిళ అస్త్వతకు గురైంది.   విరిగిపోయిన స్తంభం నాలుగు వైర్ల తీగలపై అలాగే ఉంది. తాండవాసులు సమాచారం ఇవ్వడంతో లైన్మెన్ వచ్చి చూసి విరిగిపోయిన స్తంభాన్ని అలాగే ఉంచి కరెంట్ సరఫరా పెట్టడం జరిగింది. అస్వస్థతకు గురైన మరుణబాయి, సుధాకర్, ఖుసాల్ కి నారాయణఖేడ్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది.