calender_icon.png 1 October, 2024 | 2:55 AM

రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు

01-10-2024 12:59:33 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు కొనసాగిన ద్రోణి.. సోమవారం దక్షిణ కర్ణాటక వద్ద సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడుతాయని చెప్పింది.