calender_icon.png 27 September, 2024 | 4:52 PM

హెచ్చరికలు లేకుండా సాత్నాల గేట్లు ఎత్తివేత

09-09-2024 03:29:01 AM

  1. వాగులో పెరిగిన వరద ఉధృతి.. చిక్కుకున్న రైతులు 
  2. ఆరుగురిని కాపాడిన గ్రామస్థులు

ఆదిలాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా సాత్నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వాగులో వరద ఉధృతి పెరిగి ఆరుగురు రైతులు చిక్కుకున్నారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది. జైనథ్ మండలంలోని పెండలాడకు చెందిన ఆరుగురు రైతులు శనివారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని ఎండ్లబండిపై ఇంటికి వెళ్తూ వాగు దాటుతున్నారు.

అదే సమయం లో సాత్నాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగడంతో అధికారులు 2 గేట్లు ఎత్తారు. దీంతో వాగులో నీటి ప్రవాహం పెరిగి రైతులు ఎడ్లబండితో సహా చిక్కుకున్నారు. గమనించిన గ్రామ స్థులు అప్రమత్తంగా వ్యవహరించి రైతులను, ఎడ్లను ఒడ్డుకు చేర్చడంతో  పెను ప్రమాదం తప్పిం ది. అధికారులు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసేటప్పుడు ముందస్తు సమాచారం ఇవడంలేదని, సమయపాలన పాటించడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.