హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలుగా మారాయి. సోమవారం రాత్రి 8 గంటలకు అధికారులు ఉస్మాన్ సాగర్ జలాశయానికి సంబంధించిన ఆరు గేట్లను ఒక ఫీట్ మేర ఎత్తి దిగుకు వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్కు ఇన్ఫ్లో 700 క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 726 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం (1790.00 అడుగులు)తో 3.900 టీఎంసీల నీళ్లు కలిగిఉంది. అటు హిమాయత్ సాగర్కు కూడా వరద కొనసాగుతోంది. హిమాయత్ సాగర్కు ప్రస్తుతం 300క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది.