చెక్డ్యాంలో మునిగి బాలుడి మృతి
నాగారం, అక్టోబర్ 21: సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్థమానుకోట గ్రామానికి చెం దిన ఖమ్మంపా టి నాగరాజుకు ముగ్గురు కుమారు లు. వీరిలో పెద్దవాడైన మనీశ్వర్(11) ఆదివారం సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామంలోని బిక్కేరు వాగు చెక్ డ్యామ్లో ఈత కొట్టేందు కు వెళ్లాడు. ఈత కొడుతుండగా ఆ ప్రాంతంలో జేసీబీ తీసిన గుంతలో మునిగి మృతిచెందాడు.