12-02-2025 12:18:23 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 11 : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మాయమాటలతో అపహరించి, లైంగిక దాడికి పాల్పడిన సంఘటనలో కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత, రఘు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ లోని ఎన్టీఆర్ నగర్ కాలనీలో షేక్ ఇమామ్(27) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. స్థానికంగా మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 2013లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని రిమాండ్ తరలించారు. ఈ కేసును ఎల్బీనగర్ లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించి, మంగళవారం తీర్పు వెలువరించింది. షేక్ ఇమామ్ ను దోషిగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. కేసులో నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.25వేల జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం అందించారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సునీత ఎం.రఘు వాదనలు వినిపించారు.