కామారెడ్డి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భర్తను చంపిన భార్యకు జీవితఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయాధి కారి సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ తీర్పునిచ్చారు. పెద్దకొడపగల్ మం డలానికి చెందిన తడకంటి సాయిలు మద్యానికి బానిసై భార్య అంజవ్వతో గొడవపడతూ ఉండేవాడు. విసుగు చెందిన అంజవ్వ 10 జూన్ 2024న భర్తను చంపేసింది. పెద్దకొడప్గల్ స్టేషన్లో కేసు నమోదవగా విచారణ చేపట్టిన న్యాయాధికారి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.