calender_icon.png 1 October, 2024 | 3:40 AM

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

01-10-2024 02:07:28 AM

యాదాద్రిభువనగిరి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): డబ్బు కోసం ఓ వ్యక్తిని హతమార్చిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జయరాజు సోమవా రం తీర్పునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మం డల పరిధిలో 2014 సంవత్సరంలో ఓ వ్యక్తిని కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన గుడికందుల శ్రీనివాస్(39), కరీంనగర్ జిల్లా రామగుండం మండలం కొత్తూ రుకు చెందిన  గుడికందుల శ్రీధర్ డబ్బుల కోసం హత్య చేశారు.

దీనిపై బొమ్మల రామారం పోలీసులు అప్ప ట్లో కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. సుదీర్ఘ వాదనల అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జయరాజు నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ సోమవారం తీర్పునిచ్చారు.