calender_icon.png 30 September, 2024 | 9:00 PM

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

30-09-2024 06:19:57 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బు కోసం ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన Cr.No:114/2014 కేసులో నిందితులు A1 చాకలి గుడికందుల శ్రీనివాస్ S/o పోచయ్య(39), OCC: PMP, R/o శివానినగర్, కరీంనగర్ టౌన్ N/o కొత్తూరు (V), కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం A4 చాకలి గుడికందుల శ్రీధర్ S/o రాజన్న(35), OCC: డ్రైవర్, R/o గుజ్జుస్ పట్టణం, చంద్రాపూర్ జిల్లా, మహారాష్ట్ర, N/o అకంపల్లి గ్రామం,  రామగుండం మండలం, కరీంనగర్ జిల్లాలకు జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 364,302,201,379 IPC, SC:226/2019, బొమ్మలరామారం PS SC No 19/2023, ప్రకారం భువనగిరి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ న్యాయమూర్తి నిందితులను సోమవారం 30/09/2024న, దోషులుగా నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు శిక్ష, రూ.65000/- జరిమానా విధించబడింది.