calender_icon.png 19 October, 2024 | 1:03 AM

కూతురిని హత్య చేయించిన తల్లికి, ప్రియుడికి జీవిత ఖైదు

18-10-2024 10:15:56 PM

సంగారెడ్డి,(విజయక్రాంతి): అక్రమ సంబంధం మోజుల్లో పడి ఓ తల్లి ప్రియుడితో కలిసి కన్న కూతురిని హత్య చేయించింది. వివరాల్లోకి వెళ్లితే.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన భార్య కల్పన రెండవ కాన్పు కొసం తల్లిగారి గ్రామం బోడపహాడ్, షాబాద్ మండలం వెళ్ళింది. వివాహిత రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని, సదాశివపేట పీఎస్ ఎంఎల్  కాలనీలో నివాసం ఉంటుంది. 26 ఫిబ్రవరి 2019న తన పెద్ద కూతురు చనిపోయిందని తెలిపింది. కూతురు ఒంటిపై కమిలిన గాయాలున్నాయని,  మరణంపై అనుమానం ఉందని తగ్గు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారన్నారు. సదాశివపేట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేయగా  నిందితురాలు కల్పన రెండవ కాన్పు కొరకు తన తల్లిగారి గ్రామం బోడపహాడ్ వెళ్ళి అక్కడ తన ఇద్దరు పిల్లలు భవ్య( 3), భావన (9)నెలల పాపతో కలిసి, నిందితుడైన రాజుతో అక్రమ సంబంధం పెట్టుకుని సదాశివపేటలో ఉంటుందన్నారు. భవ్య రాజును నాన్న అని పిలవలేదని, నిందితుడు పాప తలను గోడకు కొట్టడంతో స్పృహ కోల్పోయింది. భవ్యను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయిందని తెలిపారు.  రాజు, కల్పనపై చార్జ్ షీట్ దాఖలు చేయగా కేసు పూర్వాపరాలను విన్న  ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి  జి.భవానీ చంద్ర నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 500  జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితులకు శిక్షపడేలా కృషి చేసిన అప్పటి ఎస్హెచ్ఓ శ్రీధర్ రెడ్డి ఇన్స్పెక్టర్, ప్రస్తుత ఎస్హెచ్ఒ మహేష్ గౌడ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శైలజ, కోర్ట్ డ్యూటీ హెడ్ కానిస్టేబుల్స్ రవి, వెంకటేశ్వర్లు, కోర్ట్ లైజనింగ్ అధికారి కె. సత్యనారాయణ  ఎస్పీ  అభినందించారు.