రుణమాఫీ చేయాలని విన్నపం
బెల్లంపల్లి, సెప్టెంబర్ 18: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో మూడు వందల మంది రైతులు బుధవారం రాష్ట్ర గవర్నర్ జిష్నుదేవ్వర్మకు లేఖలు పంపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల పంట రుణమాఫీ చేసేలా చూడాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు.