హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్’. ఈ చిత్రానికి విక్రమ్రెడ్డి దర్శకుడు కాగా, బెక్కెం వేణుగోపాల్, సృజన్కుమార్ బొజ్జం నిర్మాతలు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకున్నప్పటికీ ఆ తేదీన విడుదల సాధ్యం కావడంలేదు. ఈ విషయమై దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. “నేటి యువతరానికి నచ్చే అంశాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘రోటీ కపడా రొమాన్స్’ చిత్రాన్ని తెరకెక్కించాం. అనివార్య కారణాల వల్ల సినిమా విడుదలను వాయిదా వేశాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం” అని తెలిపారు.