గ్వాలియర్: భారత్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్లో కొత్త బంగ్లా ప్లేయర్లను చూస్తారని బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో తెలిపాడు. శాంటో మాట్లాడుతూ.. ‘మేము సిరీస్ గెలవాలని చూస్తు న్నాం. దూకుడైన ఆట ఆడేందుకు ప్రయత్నిస్తాం. వరల్డ్ కప్లో మాకు సెమీస్ ఆడేందుకు మంచి అవకాశాలు వచ్చినా మేము వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయాం.
అంద రూ నాణ్యమైన క్రికెట్ ఆడతారని ఆశిస్తున్నా’ అని తెలిపాడు. టెస్టు సిరీస్ను ఇండియా 2 తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 6న మొదలుకానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి టీ20 గ్వాలియర్ వేదికగా, రెండో టీ20 (అక్టో బర్ 9న) ఢిల్లీలో.. ఇక చివరి టీ20 అక్టోబర్ 12న హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరగనున్నాయి.