calender_icon.png 8 April, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

08-04-2025 12:00:00 AM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర

లక్షెట్టిపేట, ఏప్రిల్ 7: మండలంలోని పాత కొత్త కొమ్ముగూడెం, మున్సిపాలిటీ లోని పలు వార్డుల్లో ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, అభియాన్, రాజ్యాంగ పరిరక్షణ’ పాదయాత్రకు ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిట్ల సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ... రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, కలసికట్టుగా పోరాడి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు.

మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ ర్యా లీ నిర్వహిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్,మండల అధ్యక్షులు ఎండి ఆరిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూర్ణచందర్ రావు, చిం త అశోక్ కుమార్,నాగభూషణం,జిల్లా ఆర్టిఏ మెంబెర్ అంకతి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు అనిల్, పట్టణ యూత్ అధ్యక్షుడు రాందేని వెంకటేష్, యూత్ అధ్యక్షుడు సుమన్, మాజీ కౌన్సిలర్ వెంకటేశ్, మండ ల, మున్సిపాలిటీ కార్యకర్తలు పాల్గొన్నారు.