12-02-2025 12:00:00 AM
పటాన్చెరు, ఫిబ్రవరి 11: ప్యారా నగర్లో డంప్యార్డును ఏర్పాటు చేయని గుమ్మడిదల మండల ప్రజల తేల్చిచెపుతున్నారు. రెండు, మూడు రోజు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మంగళవారం నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిదలలో నిరసనలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గుమ్మడిదలలో పశువులు, మేకలు, గొర్రెలతో ర్యాలీ నిర్వహించారు. వాటిపై డంప్యార్డు వద్దంటూ రాతలు రాసి నిరసనలు తెలిపారు.