కోదాడ ఫిబ్రవరి 6: సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత వస్త్రాలను అందరూ ప్రోత్సహించాలని జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో గల టిటిడి కళ్యాణమండపం నందు ఏర్పాటుచేసిన చేనేత హస్తకాల ప్రదర్శన మరియు అమ్మకమును వారు ప్రారంభించి మాట్లాడారు.
ఈనెల 20 వ తారీఖు వరకు 15 రోజులపాటు నిర్వహించే ఈ ప్రదర్శన అమ్మకములను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్వాహకులు శ్రావణ్ చౌదరి, వినోద్ కుమార్, వంగవీటి గురుమూర్తి, పబ్బా గీత, జగనీ ప్రసాద్, గరణే శ్రీనివాసరావు, ఆగిర్ మధు, బెలీదే భరత్, చల్ల అశోక్, బోనాల సైదారావు, వంగవీటి లోకేష్, పబ్బ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు