పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకార ధోరణిని ప్రశ్నించేందుకేనని, ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అన్నారు. మంత్రి అనుకోకుండా సినీ ప్రముఖులపై కొన్ని కామెంట్స్ చేశారని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ వివాదానికి సినీ ప్రముఖలు ఇంతటితో ముగింపు పలకాలని గురువారం ట్విట్టర్ వేదికగా కోరారు.
‘మంత్రి సురేఖపై కేటీఆర్ మనుషులు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఓ సోదరుడిగా ఓ సోదరికి నూలుపోగు దండ వేసిన విధానాన్ని ట్రోల్ చేశారు. దీన్ని సినీ ప్రముఖలు కూడా చూసి ఉండొచ్చు. దీంతో ఆ మహిళ ఎంతో బాధపడ్డారో ఒకసారి అర్థం చేసుకోవాలి. సినీ ప్రముఖలుపై చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ బేషరత్గా ఉపసంహరించుకున్నారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని మహేశ్కుమార్గౌడ్ సూచించారు.