18-02-2025 06:58:33 PM
నిర్మల్ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని నిర్మల్ డిఎం ప్రతిమారెడ్డి అన్నారు. మంగళవారం ఎండి సత్యనారాయణ ఆదేశాల మేరకు సంస్థ పరిరక్షణపై ఉద్యోగులతో సమావేశం నిర్వహించి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీ ఆర్టీసీ ద్వారా అందిస్తున్న సేవలు ఉద్యోగుల బాధ్యతలు అంశాలపై సిబ్బందికి వివరించి సంస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులదైన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజశేఖర్, నవీన్ కుమార్, సిబ్బంది ఉన్నారు.