calender_icon.png 23 September, 2024 | 8:56 PM

రాష్ట్ర ప్రయోజనాల కోసం నడుం బిగిద్దాం

25-07-2024 01:52:36 AM

ఏకమై కేంద్రంపై పోరాడాలన్న కూనంనేని 

హైదరాబాద్, జూలై 24 (విజ య క్రాంతి): రాష్ట్ర ప్రయో జనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపై నడిచి కేం ద్రంపై పోరాటం చేయాలని సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టకుండా రాజకీయ ప్రయో జనాల కోసం విమర్శలు చేసుకుంటే ప్రజలు క్షమించరని, సభలో సభ్యు లంతా సమన్వయంతో ఉండాలని సూచించారు. బుధవారం అసెం బ్లీలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చ లో మాట్లాడుతూ.. మోదీ సర్కార్ గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేధింపులకు గురి చేసిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వాన్ని కూడా అదే ధోరణిలో ప్రవ రిస్తూ నిధులు కేటాయించకుండా ఇబ్బందులు పెడుతుందని మండిప డ్డారు. తెలుగు రాష్ట్రాలంటే బీజేపీకి ఎప్పడూ చిన్న చూపేనని, ఏపీకి కూడా ప్రేమతో నిధులు కేటాయిం చలేదని, వారి బలంతో ప్రభుత్వం నడుస్తుండటంతో తప్పనిసరి పరి స్థితుల్లో కేటాయించిందని పేర్కొన్నారు.