రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత
రైతులకు వినియోగదారులకు నష్టం కలగనివ్వం
గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి వెల్లడి
అబ్దుల్లాపూర్మెట్: రైతు బజార్లలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డి అన్నారు. పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి కొత్తపేట రైతు బజార్ను సందర్శించారు. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సూచించిన ధరలకు వినియోగదారులకు అమ్ముకోవచ్చన్నారు.
ఈ సందర్భంగా చిలుక మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ... రైతు బజార్లలో దళారీ వ్యవస్థను రూపుమాపుతామన్నారు. కొత్తపేట రైతు బజార్లో రైతులకు నష్టం కలిగేలా సాయంత్రం వేళల్లో కొంత మంది దళారులు అమ్ముతున్న విషయాన్ని రైతులు తమ దృష్టికి తెచ్చరని తెలిపారు. అట్టి దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. మార్కెట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత అధికారులదేన్నారు. రైతులకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత మనదే అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, రఘుపతి రెడ్డి, అంజయ్య.. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్రవంతి, సూపర్ వైజర్లు, ఇతర సిబ్బంది తదితరులున్నారు.