calender_icon.png 16 April, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

14-04-2025 06:30:53 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి...

కామారెడ్డి (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అదన కలెక్టర్ చందర్ నాయక్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

భారత రత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్.  అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో  మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు ప్రభుత్వం నెరవేర్చిందని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ పరిధి కేంద్రంలోని  జిల్లా, అదనపు కలెక్టర్ చందర్ నాయక్ జిల్లా గ్రంధాలయ శాఖ చంద్రకాంత్ రెడ్డి తో కలిసి అంబేద్కర్  విగ్రహానికి  పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి  పూల మాలతో అలంకరించి  జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయల సాధనకు కృషి చేసి, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృతనిత్యంతో ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం పేదల ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వమని ఈ వర్గాలు ఆర్థికంగా ఎదగడం కోసం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అందరికీ న్యాయం జరిగేలా  అంబేద్కర్ ఆలోచనల స్పూర్తితో ముందుకు సాగుతున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రిజర్వేషన్ ఫలాలు పదవులను అనుభవిస్తున్నామని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో  మనమంతా ముందుకు సాగాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిని రజిత, ఎస్ సి కార్పొరేషన్ ఈ డి దయానంద్, టీఎన్జీ జి ఓ ఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, బహుజన సంఘ నాయకులు కొత్తపల్లి మల్లయ్య వివిధ సంఘాల నాయకులు చక్రధర్, దేవరాజ్, రాజ్యలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, సహాయ సంక్షేమ అధికారి వెంకటేష్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంక్షేమ అధికారులు  కళాజాత బృందం ప్రతినిధులు పాల్గొన్నారు,