నిర్మల్ (విజయక్రాంతి): కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు అన్ని విభాగాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మహిళల సమావేశాన్ని నిర్వహించి మహిళా విభాగాన్ని త్వరలో ప్రకటించరున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని అదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా పార్టీని విస్తరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.