త్వరలో సీఎంకు సియోల్ టూర్ నివేదిక : మంత్రి పొంగులేటి
హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని, మూసీ నిర్వాసితులకు మంచి జీవితం ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. దక్షిణ కొరియాలోని సియోల్లో ఒకప్పుడు మన మూసీ కంటే ఎక్కువ మురుగు ఉండేదని, వాళ్లు అద్భుతంగా సియోల్ నదిని ప్రక్షాళన చేశారని మంత్రి పేర్కొన్నారు.
సియోల్లోని పరిస్థితులను పరిశీలించి వచ్చామని, తాము పరిశీలించిన అంశాలపై ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్రెడ్డికి, రాష్ట్ర క్యాబినెట్కు నివేదిక ఇస్తామని తెలిపారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ పట్టణంలో హన్నది పునరుజ్జీవన ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం రాష్ట్రానికి తిరిగొచ్చారు.
ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరుల తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం వ ద్ద మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియాలో ఉన్న స్పోర్ట్స్ సిటీ, స్మా ర్ట్స్ సిటీ, వ్యర్థాల నిర్వహణ, ఎస్టీపీలు పరిశీలించామమని మంత్రి పేర్కొన్నారు.
పేదల విషయంలో రాజకీ యాలు వద్దని, పేదలను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూ డొద్దని సూచించారు. మంచి చేసే విషయంలో సూచనలు చేయాలని, పనుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే చెబితే వాటిని సరిదిద్దుకుంటామని ఆయన చెప్పారు.