calender_icon.png 20 June, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిఆర్ఎస్ ప్లీనరీ విజయవంతం చేద్దాం

24-04-2025 04:48:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఈనెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని జిల్లా సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి పట్టణ అధ్యక్షులు మార్గొండ రాము అన్నారు. గురువారం పట్టణంలోని వివిధ వార్డులో టిఆర్ఎస్ ప్లీనరీ సభకు కార్యకర్తల తరలింపు పై సమావేశాలు నిర్వహించి సభ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి కండువాలను వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కృష్ణారెడ్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.