calender_icon.png 21 March, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

20-03-2025 05:38:28 PM

ఎస్పి కిరణ్ ఖరే ప్రభాకర్..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు యువత, విద్యార్థులు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్ కోసం బాటలు వేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని ప్రారంభదశలోనే గుర్తించి, నివారించాలని, డ్రగ్స్, గంజాయి విక్రయ దారులు యువతను లక్ష్యంగా చేసుకుని తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని, యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని, నేర ప్రవృత్తి వైపు దారి తీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు.

తద్వారా కుటుంబ సభ్యులు, బందువులకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై, యువత చెడిపోవద్దని ఎస్పీ సూచించారు. దీనిపై యువత చైతన్యం కలిగి ఉండాలన్నారు. డ్రగ్స్ వినియోగిస్తే చాల దుష్పరిణామాలు, చూపుతాయని పేర్కొన్నారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి సంబంధిత సమాచారం తెలిస్తే 87126 58111 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తే చట్ట పరంగా  కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు.