తెలుగమ్మాయిని కాకపోయినా ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు అని మురిసిపోతోంది హాసినీ సుధీర్. రాజ్తరుణ్ హీరోగా రూపొందిన ‘పురుషోత్తముడు’ చిత్రంలో కథానాయికగా నటించిందామె. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాను న్న సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించిన ఈ మరాఠీ భామ “హీరోయిన్ కావాలన్నది నా చిన్నప్పటి కల. ముంబైలో మోడలింగ్ చేశాను. దర్శకుడు రామ్ భీమన ఆడిషన్ చేసి ఈ పాత్రకు నన్ను ఎంపిక చేశారు. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు.
ఈ సినిమాలో అమ్ములు అనే పాత్ర పోషించాను. తొలి సినిమాలోనే ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ లాంటి నటులతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. కళ్లతోనే వాళ్లు భావోద్వేగాలన్ని పలికిస్తారు. తొలి సినిమా అన్న భావనను దూరం చేస్తూ సెట్స్లో రాజ్తరుణ్ సహకారం అందించారు” అంటూ సినిమా సంగతులను పంచుకుంది. తెలుగు సినిమాల మీద మక్కువతో భాష కూడా నేర్చుకున్నా అంటున్న హాసిని.. హీరో నాని తన అభిమాన కథానాయకుడని చెప్పుకొచ్చింది.