14-02-2025 01:56:46 AM
పెబ్బేరు, పిబ్రవరి 13: తరగతుల వారీగా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యా లను పెంపొందించే విధంగా విద్యాబోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దు ల్ గని తెలిపారు. గురువారం పెబ్బేరులోని ఎమ్మార్సీ భవనంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా విద్యార్థుల సామర్థ్యలను పరిశీ లించారు. విద్యార్థులు చదవడం, రాయ డం, ప్రాథమిక గణితాన్ని నేర్చుకోవడం కోసం కృషి చేయాలని సూచించారు. ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి విజయరాములు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు.