calender_icon.png 7 October, 2024 | 7:59 PM

సీఎం చంద్రబాబును కలిసిన నేతలు

07-10-2024 05:29:42 PM

మహేశ్వరం, (విజయక్రాంతి): మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, మమత గార్ల కూతురు మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకుర మల్లారెడ్డి మనువరాలు శ్రేయ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి,మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి మర్యాద పూర్వకంగా చంద్రబాబు నాయుడును కలిసి సోమవారం  అందజేశారు. ఈ సందర్భంగా త్వరలోనే  తిరిగి టీడీపీ పార్టీ లో చేరుతాను అని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు.