కామారెడ్డి (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ లో నిర్వహిస్తున్న మాలల ఆత్మగౌరవ బహిరంగ సభకు ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ కామారెడ్డి నియోజకవర్గం మండలాలు గ్రామాల నుంచి మాల మహానాడు నాయకుడు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ వర్గీకరణ నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని మాల మహానాడు నాయకులు పేర్కొన్నారు. అప్పటివరకు ఉద్యమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లూరు సాయిలు, వెంకటేష్, నర్సింహులు, జగన్, మోహన్, ప్రశాంత్, మన్నెచిన సాయిలు, శివయ్య, సురేష్, వినోద్, ఆనంద్, వెంకటరత్నం, గంగారాం, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.