calender_icon.png 20 October, 2024 | 9:05 AM

420 నాయకులు అధికారంలోకి వచ్చారు

20-10-2024 12:34:37 AM

 మాజీ మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మోసపూరిత హామీలతో నేడు రాష్ర్టంలో 420 రాజకీయ నాయకుల ప్రభుతం ఏర్పడిందని, తదారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని  ఖండాల, అంకాపూర్ గ్రామాల్లో శనివారం బీఆర్‌ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

రైతులను, ఆదివాసీలను మోసం చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నాయకులు కాలరాస్తున్నారని విమర్శించారు. సంపూర్ణ రుణమాఫీ చేయకుండా రైతులను తీవ్ర ఇక్కట్లు గురి చేస్తున్నదన్నారు. కాగా ఈ నెల 24న ఆదిలాబాద్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో చేపట్టే నిరసన సభకు కేటీఆర్ హాజరుకానున్నారని తెలిపారు.

సభకు రైతులు, కార్మికులు, కరకులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు గండ్రత్ రమేష్, మెట్టు ప్రహ్లాద్, కుమ్రా రాజు, జగదీష్, పరమేశర్, రమణ, గంగయ్య, జంగు బాపు, సిడం లక్ష్మణ్, వసంత్, దేవదాస్, మాధవ రావు,  సతీష్, రవి, భీమ్రావు, సిడం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు..