calender_icon.png 24 October, 2024 | 7:47 AM

కాంగ్రెస్ పాలనతో ప్రజలకు అభివృద్ధి ఫలాలు

17-09-2024 03:56:49 PM

వల్లాల గ్రామంలో అమరవీరుల స్థూపం శంకుస్థాపన

మాజీ ఎంపీ ఏఐసీసీ నాయకులు హనుమంతరావు

తుంగతుర్తి,(విజయక్రాంతి): శాలిగౌరారం మండల పరిధిలో వల్లాల గ్రామంలో అమరావీరుల స్థూపం శంకుస్థాపనకు ఎఐసిసి నెంబర్ మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ ఎంపీ రాజసభ సభ్యులు హనుమంత రావు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంలో తెలంగాణ ప్రజలు మోసపోయారని అన్నారు. అమరవీరులను గుర్తించేది కాంగ్రెస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు అభివృద్ధి ఫలాలు అంద ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు