calender_icon.png 25 April, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రదాడికి న్యాయవాదుల నిరసన

25-04-2025 04:36:03 PM

భైంసా (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో అమాయక ప్రజలపై ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భైంసా కోర్టు బార్ అధ్యక్షుడు సి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉగ్రదాడిని నిరసిస్తూ కోర్టు ఆవరణ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో ప్రధాన రహదారిపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు శాంతి కలిగించాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.