24-03-2025 12:29:45 PM
ఎల్బీనగర్: చంపాపేట డివిజన్ లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యారు. అడ్వకేట్ ఇజ్రాయిల్ ఇంటిలో కిరాయి ఉండే ఓ మహిళను దస్తగిరి అనే ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ వేధింపులకు గురి చేశాడు. ఆ విషయంపై ఇజ్రాయిల్ మహిళ తరపున పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కారణంతో కక్ష కట్టిన దస్తగిరి అడ్వకేట్ ఇజ్రాయిల్ పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.