calender_icon.png 10 October, 2024 | 4:51 PM

న్యాయవాదుల రక్షణకు చట్టం

09-10-2024 12:00:00 AM

అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి 

కరీంనగర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్‌రెడ్డి అన్నారు. వేములవాడ, సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రతినిధులతో మంగళవారం ఆయన సమావేశమై ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.

ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. యువ న్యాయవాదులకు రూ.5 వేల గౌరవ వేతనం ఇచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. కోర్టుల సొంత భవనాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.