calender_icon.png 25 October, 2024 | 12:00 PM

ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడితప్పింది

22-07-2024 02:04:44 AM

ఎంపీ విజయసాయిరెడ్డి

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌లో లా అండర్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పిందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో 30కిపైగా హత్యలు, 300కుపైగా హత్యాయత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తులను, 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని ఆరోపించారు. శాంతిభద్రతలు క్షీణించిన ఏపీలో రాష్ర్టపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. కానీ, టీడీపీ ఆ ఊసే ఎత్తలేదని, బీజేపీతో టీడీపీ పూర్తిగా రాజీపడినట్లు కనిపిస్తోందన్నారు.