calender_icon.png 23 October, 2024 | 3:06 AM

రాజ్‌ తరుణ్‌పై లావణ్య సంచలన వ్యాఖ్యలు

11-07-2024 12:43:09 PM

హైదరాబాద్: నటుడు రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నార్సింగి పీఎస్ లో మాల్వి మల్హోత్రా, మయాంక్ మల్హోత్రాపై కేసు బుక్ చేశారు. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడని నార్సింగ్ పీఎస్ లో లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నారంటూ లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. జనవరిలో తాను అమెరికాలో నుంచి తిరిగి వచ్చానని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది.డ్రగ్స్ కేసు ఆరోపణలతో తనను 45 రోజులు జైలులో పెట్టారని లావణ్య వాపోయింది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి తనను ఇరికించారని తెలిపింది. తనను మోసం చేసిన రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని లావణ్య డిమాండ్ చేసింది.