కామారెడ్డి, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం కిసాన్ మెన్స్ వేర్ క్లాత్ షోరూంను నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. పురుషులకు ప్రత్యేకంగా కామారెడ్డిలో షోరూం లేనందున కామారెడ్డి స్టేషన్ రోడ్డులో కిసాన్ మెన్స్వేర్ దుకాణాన్ని ప్రారంభించారు.
కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేద పండితులు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ దంపతులు అతడి సోదరుడు ఉదయ్కుమార్ దంపతులు, ప్రణయ్కుమార్ దంపతులు, డాక్టర్ రాఘవేంద్ర చిద్ది రావార్, బట్టల వర్తక సంఘం ప్రతినిధులు, ప్రముఖ వ్యాపారి నూకల ఉదయ్కుమార్ దంపతులు పాల్గొన్నారు.