నల్లగొండ, అక్టోబర్ 17 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని సయ్యద్ హజరత్ షా లతీఫుల్లా ఖాద్రీ దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం గంధం ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. క్లాక్ టవర్ సమీపంలోని మదీనా మజీద్ నుంచి ప్రారంభమైన గంధం ఊరేగింపు లతీఫుల్లా షా ఖాద్రీ దర్గా వరకు కొనసాగింది. ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి గంధం ఊరేగింపులో రోడ్డు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు.