calender_icon.png 14 October, 2024 | 8:13 AM

17 నుంచి లతీఫ్ షా ఉల్లా ఖాద్రీ దర్గా ఉర్సు

14-10-2024 03:19:03 AM

నల్లగొండ, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేంద్రంలోని హజరత్ సయ్యద్ లతీఫ్ షా ఉల్లా ఖాద్రీ దర్గా ఉర్సు ఈ నెల 17 నుంచి ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉర్సు ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. నెలపాటు జరుగనున్న ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. కులమతాలకు అతీతంగా దర్గా దర్శనానికి భక్తులు భారీగా తరలిరానున్నట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మున్సిపల్ చైర్మన్ హామీ ఇచ్చారు.