యువకులు, హిజ్రాల అరెస్టు
చార్మినార్, సెప్టెంబర్ 29: గుట్ట్టుచప్పుడు కాకుండా అర్థరాత్రి పూట ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న 8 మంది యువకులతో పాటు నృత్యాలు చేస్తున్న నలుగురు హిజ్రాలను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం సౌత్జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందె శ్రీనివాస్రావు తెలిపిన వివరాలు..
బండ్లగూడ గౌస్నగర్ బస్తీలో ఓ గదిలో కొందరు గుట్టుచప్పుడు కాకుండా ముజ్రా పార్టీ చేసుకుంటున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం ఆధ్వర్యంలో పోలీసులు దాడిచేశారు.
ఈ దాడిలో ఇస్మాయిల్నగర్కు చెందిన మహ్మద్ జాబ్రీ, మహ్మద్ రియాజ్, షేక్ సోహైల్ ,షాన్వాజ్ ఖాన్, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఫిరోజ్, సయ్యద్ షా ఫారుఖ్, షేక్ మహ్మద్తో పాటు మైలార్దేవ్ పల్లికి చెందిన సోహైల్ అలియాస్ అర్జూ, పురానాపూల్కు చెందిన మహ్మద్ సైఫ్ అలియాస్ లవ్లీ, జల్పల్లికి చెందిన కరీమ బక్ష, వట్టేపల్లికి చెందిన అబ్దుల్ అమేర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో ఉపయోగించిన వస్తువులను సీజ్ చేశారు. నిందితులను బండ్లగూడ పోలీసులకు అప్పగించారు.