calender_icon.png 9 October, 2024 | 9:57 PM

వరద బాధితుల సహాయార్థం లార్సెన్ అండ్ టూబ్రో భారీ విరాళం

09-10-2024 07:52:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి సినీ ప్రముఖులు, పారిశ్రమికవేత్తలు ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాజాగా లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ వరద బాధితులకు సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.5.50 కోట్లు విరాళం అందించింది.

బుధవారం తెలంగాణ సచివాలయంలో లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసి చెక్కును అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారిని అభినందించారు.