చార్మినార్, జూలై 7: చారిత్రాత్మకమైన లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి దశాబ్ది బోనాల ఉత్సవాలు దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించేందుకు ఆదివా రం ఆలయ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రాజేందర్ యాదవ్ ఆధ్వర్యంలో భక్తులు బయలుదేరారు. ముందుగా స్థానికంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రతినిధులు, ఆ తర్వాత డప్పు వాయిద్యాలతో ర్యాలీగా తరలివెళ్లారు. రైలు లో ఆలయ ప్రతినిధులతో పాటు కళాకారుల బృందం జాతరలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేందర్ యా దవ్ మాట్లాడుతూ.. పదేండ్ల క్రితం మొదలైన బోనాల ఉత్సవాలను ప్రభుత్వాల సహ కారంతో ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. 8,9,10 తేదీల్లో మూడు రోజు ల పాటు బోనాల జాతర ఉంటుందన్నారు. ఈ ఉత్సవాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొంటున్నట్లు తెలిపారు.