calender_icon.png 11 October, 2024 | 5:56 AM

లక్ష్యసేన్ ఓటమి

11-10-2024 01:29:16 AM

వన్‌టా (ఫిన్‌లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-19, 18-21, 15-21తో చైనీస్ తైపీకి చెందిన చూ చెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. తొలి గేమ్ గెలిచినప్పటికీ వరుసగా రెండు, మూడు గేముల్లో మాత్రం లక్ష్యసేన్ ప్రత్యర్థికి దాసోమయ్యాడు.