calender_icon.png 23 October, 2024 | 5:28 PM

అశ్రునయనాల మధ్య లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు..

23-10-2024 03:38:46 PM

కరీంనగర్ (విజయక్రాంతి): మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాతృమూర్తి గంగుల లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలు కరీంనగర్ లో అశ్రునయనాల మధ్య ముగిశాయి. క్రిష్టియన్ కాలనీలోని స్వగృహం నుంచి సప్తగిరి కాలనీలోని స్వర్గధామం వరకు జరిగిన అంతిమయాత్రకు భారీ సంఖ్యలో రాజకీయ నాయకులు, బంధువులు తరలివచ్చారు. అంతకుముందు మాజీ మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ రాకేష్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మేయర్ సునీల్ రావు, మాజీ సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మెన్ రవిందర్ సింగ్, జిల్లా కలెక్టర్ పమెలా సత్పతి, మున్సిపల్ కమీషనర్ చాహత్ బాజ్ పాయ్, సూడా చైర్మెన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు జి.వి. రామకృష్ణ, పలువురు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు లక్ష్మీనర్సమ్మ బౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

గంగుల కమలాకర్ తో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లక్ష్మీనర్సమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవున్ని ప్రార్దిస్తూ గంగుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం గంగుల స్వగృహం నుంచి స్వర్గదామం వరకు సాగిన అంతిమయాత్రతో పాటు అంత్యక్రియల్లో వీరు పాల్గోని కడసారి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి, అడషనల్ కలెక్టర్లు, ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ లు, ఆర్.డి. ఓ. ఉమా మహేశ్వర్, టిఎన్. జి. ఓ నాయకులు, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మెన్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.