17-04-2025 09:43:47 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఎన్టిఎస్ఓ పరీక్షలో పట్టణంలోని లక్ష్మీనగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి బహుమతులు గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్ అయూబ్ తెలిపారు. హర్షిత్ రావు ట్యాబ్, జిడ్డిగి అక్షిత స్మార్ట్ వాచ్ గెలుచుకోగా 50 మంది విద్యార్థులు వివిధ బహుమతులు గెలుచుకున్నారన్నారు. గురు వారం స్కూల్ లో జరిగిన అభినందన సభలో ఏజిఎం అరవింద్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జయరాజ్ , కోఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, ఇంచార్జ్లు ప్రియాంక, అనగమత, నాసా ఇంచార్జ్ స్వాతి, ప్రియాంక విద్యార్థులకు బహుమతులు, పతకాలు అందజేశారు.